chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఇవాళ ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో అధిక ధరలకు చిరునామాగా ఏపీ మారిందని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయనన్న అప్పులు ఏపీయే చేసిందని అన్నారు. పన్నుల భారంతో వైసీపీ సర్కారు రాష్ట్రంలో సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతోందని చెప్పారు. పోలవరాన్ని రివర్స్ గేర్లో వెనక్కి తీసుకెళ్తున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ, దానిపై ఏపీ ప్రజలు తిరుగుబాటు చేయలేదని, వారికి శ్రీలంక ప్రజల కంటే ఓపిక ఎక్కువగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, తన పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు వరద బాధితుల సమస్యలు తెలుసుకుంటున్నారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వరద నష్టంపై పరిశీలన చేస్తున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు పశ్చిమ గోదావరి పాలకల్లు రామచంద్ర గార్డెన్స్ చేరుకుని, రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు.
National Herald case: రాహుల్, ప్రియాంకతో ఈడీ ఆఫీసుకు సోనియా.. విచారణ షురూ