MP Komatireddy Venkat Reddy : ప్రాణం పోయినా కాంగ్రెస్ లోనే ఉంటా : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లోనే పుట్టాను..కాంగ్రెస్ లోనే ఉంటానని అన్నారు. ప్రాణం పోయినా కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకూ చీమూ నెత్తురు ఉందన్నారు. పార్టీ ముఖ్యమే.. అంతిమంగా ప్రజలు ముఖ్యం అని అన్నారు. ఏదైనా చేస్తే అందరికీ చెప్పే చేస్తానని చెప్పారు.

MP Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లోనే పుట్టాను..కాంగ్రెస్ లోనే ఉంటానని అన్నారు. ప్రాణం పోయినా కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకూ చీమూ నెత్తురు ఉందన్నారు. పార్టీ ముఖ్యమే.. అంతిమంగా ప్రజలు ముఖ్యం అని అన్నారు. ఏదైనా చేస్తే అందరికీ చెప్పే చేస్తానని చెప్పారు.

తాను బీజేపీలోకి వెళ్తే చెప్పే వెళ్తానని పేర్కొన్నారు. తాను దేనికీ భయపడను..ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. ముఖ్యమైన సమావేశాలున్నాయి కాబట్టే ఢిల్లీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి కోసం కలిస్తే రాజకీయం చేయొద్దని హితవు పలికారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Komatireddy Venkat Reddy : రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ను రేవంత్ ను ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ దగ్గర తేల్చుకుంటానని చెప్పారు. పాత కాంగ్రెస్ వాళ్లను పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని విమర్శించారు. తనను కూడా వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంటే 6 నెలలు రేవంత్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.

తనను అడగకుండానే తన నియోజకవర్గంలో సభ పెట్టారని తెలిపారు. తనకు పడని వారిని పార్టీలో చేర్చుకున్నారని పేర్కొన్నారు. తన వ్యతిరేకులు ఉన్న సభకు తాను ఎలా హాజరవుతానని చెప్పారు. తన పార్లమెంట్ స్థానంలో సభ ఏర్పాటు చేసినప్పుడు తనకు చెప్పాలా? వద్దా? అని అడిగారు. తనకు తెలియకుండానే చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు.

Dasoju Shravan : కాంగ్రెస్ కు మరో కీలక నేత గుడ్ బై?

తాను 30 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని.. స్టార్ క్యాంపెయినర్..తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మొన్న వచ్చిన వారికి పీసీపీ ఇస్తారా? అని నిలదీశారు. పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ ఎందుకు బయటికి వెళ్తున్నారని పేర్కొన్నారు. అందరిని వెళ్లగొట్టి టీడీపీ వాళ్లను కాంగ్రెస్ లోకి తెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు