హైదర్ నగర్, రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ విజయం
- bheemraj
- Updated on- December 4, 2020 / 02:09 PM IST
GHMC elections counting : గ్రేటర్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. హైదర్ నగర్, రంగారెడ్డి నగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. హైదర్ నగర్ డివిజన్ లో అభ్యర్థి నార్నే శ్రీనివాసరావు విక్టరీ పొందారు. రంగారెడ్డి నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయ్ శేఖర్ గెలుపొందారు. ఇప్పటికే మెట్టుగూడ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు. టీఆర్ఎస్ 52, ఎంఐఎం 28, బీజేపీ 32, కాంగ్రెస్ 2 డివిజన్ లో ఆధీక్యంలో కొనసాగుతోంది.
