Amarnath yatra: అమర్నాథ్ యాత్రకు వెళ్ళి ఇంతవరకు ఆచూకీ అందని పలువురు ఏపీ యాత్రికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వారిలో విజయవాడకు చెందిన వినోద్ అశోక్, రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధా, తిరుపతికి చెందిన బి.మధు, గుంటూరుకు చెందిన మేదూరు ఝాన్సీ లక్ష్మి, విజయనగరానికి చెందిన వానపల్లి నాగేంద్ర కుమార్ ఉన్నారని పేర్కొంది.
Gardening: తోటపని చేస్తే మానసిక ఆరోగ్యం
వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయని తెలిపింది. ఆచూకీ లభ్యం కాని వారిలో ఇంకా చాలా మంది ఏపీ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరైనా అమర్నాథ్ యాత్రకు వెళ్ళి, వారి నుంచి ఎటువంటి సమాచారమూ రాకపోతే దగ్గరలో ఉన్న ప్రభుత్వ అధికారులకు గాని, మీడియాకు గానీ వివరాలు తెలపాలని ప్రజలకు ఏపీ సర్కారు సూచించింది.