india Top 10 billionaires : పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు. కానీ శ్రీమంతులు మాత్రం మరింతగా ధనవంతులు అవుతున్నారు. ఆఖరికి కరోనా సమయంలో కూడా శ్రీమంతులు ఏమాత్రం తగ్గేదేలేదు అన్నట్లుగా మరింత ధనవంతులుగా మారారని ఓ సర్వేలో తేలిన నిజం. భారత్ లో ఉన్న బిలియర్ల వద్ద ఉన్న సంపదతో దేశంలోని పిల్లలందరికి 25 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యనందించవచ్చట. అంటే వారి సంపద ఎంతగా భారీగా పెరిగిందో ఊహించుకోవచ్చు. కరోనా సమయంలో నష్టపోయింది ఎక్కువగా మధ్యతరగతివారు.దిగువ మధ్యతరగతివారు. ఇక పేదల సంగతి చెప్పుకోనక్కరలేదు. తినటానికి గుప్పెడు మెతుకులు లేక అల్లాడిపోయారు. ఈనాటికి వారి కష్టాల నుంచి గట్టెక్కటం మాట పక్కన పెడితే కనీసం తేరుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయినవారు ఎంతోమంది.అసలు అప్పులే పుట్టక వీధినపడ్డవారు మరెంతోమంది. ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టాడు. లేనివాడు ఉన్నవాడికే పెట్టాడు అన్న చందంగా ఉంది పరిస్థితి. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా సంపన్నదేశాలు కూడా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడాయి. ఆ నష్టాల నుంచి కోలుకోవటానికి నానా పాట్లు పడతున్నాయి.
కానీ శ్రీమంతులు మాత్రం మరింత డబ్బుని కూడపెడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగానే కాదు భారత్ లో కూడా అటువంటి పరిస్థితే ఉంది. పేదలు మరింత పేదలు అవుతుంటే శ్రీమంతులు మరింత శ్రీమంతులవుతున్నారు. అలా భారత్ లో శ్రీమంతులు వద్ద ఉన్న సంపదతో దేశంలోని పిల్లలను 25 ఏళ్లపాటు చదివించవచ్చని ఆక్స్ ఫామ్ ఇన్ ఈక్వాలిటీ నివేదికలో వెల్లడైంది. కరోనా సమయంలో కూడా 2021లో భారత బిలియనీర్ల సంపద రెట్టింపు కావటం గమనించాల్సిన విషయం.
2020 నాటికి దేశంలో 39 బిలియనీర్లు ఉంటే..వారి సంఖ్య 2021నాటికి మరింతగా పెరిగింది. అంటే 39నుంచి 142కు పెరిగింది. కానీ దేశంలో పేదల గతి మాత్రం మరింతగా దిగజారింది. కరోనా దెబ్బకు పేదలు మరింత దారిద్ర్యరేఖ దిగువుకు దిగజారిపోయిన దుస్థితి ఏర్పడింది. కరోనా దెబ్బకు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్ది చిన్నారులు చదువుకు దూరమైపోయారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.ఇది కేవలం భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు భారీగా పెరుగుతున్నాయి. పేదలు మరింత పేదలవుతుంటే..సంపన్నులు మాత్రం మరింత సంపద కూడబెడుతున్నారు.
Also Read : Covid-19 New Rule : వ్యాక్సిన్ వేయించుకోకపోతే..నెలకు రూ.8,500 జరిమానా
కానీ సంపన్నుల సంపద మాత్రం పెరుగుతునే ఉందని ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసిన నివేదికల్లో వెల్లడైంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు దావోస్ వేదికగా నేడు జరగనుంది. ఆన్ లైన్ మాధ్యమంలో దీన్ని నిర్వహిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును ఉద్దేశించి వర్చువల్ గా మాట్లాడనున్నారు. భారత్ లోని టాప్ 10 (వారి సంపాదన విలువ పరంగా చూస్తే) ధనవంతుల వద్దనున్న సంపదతో దేశంలోని పిల్లలు అందరికీ స్కూల్ విద్యతో పాటు ఉన్నత విద్య కూడా అందించవచ్చని అదికూడా 25 ఏళ్లపాటు ఉచితంగా విద్య అందించవ్చని..ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు మొదటి రోజు ఆక్స్ ఫామ్ ‘అసమానతల‘పై సర్వే వివరాలను వెల్లడిస్తుంటుంది. మహమ్మారి కారణంగా జీవనాధారం దెబ్బతిని భారత్లోని 84 శాతం కుటుంబాల ఆదాయం భారీగా తగ్గింది. అదే సమయంలో బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశ సంపదలో 45 శాతం టాప్ 10 బిలియనియర్ల వద్దే ఉంది.
Also Read : New Moon : మన సౌర కుటుంబం పక్కనే మరో చంద్రుడు..భూమికంటే మూడు రెట్లు పెద్దగా