IndvsWI 5th T20I : వెస్టిండీస్ తో నామమాత్రమైన 5వ టీ20 మ్యాచ్ లో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 188 పరుగులు చేసింది. వెస్టిండీస్ ముందు 189 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 40 బంతుల్లో 64 పరుగులతో టాప్ స్కోర్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో 2 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి.
దీపక్ హుడా(25 బంతుల్లో 38 పరుగులు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 28 పరుగులు) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ మూడు వికెట్లు పడగొట్టాడు. హేడెన్ వాల్ష్, జాసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్ తలో వికెట్ తీశారు.
విండీస్తో ఐదు టీ20ల సిరీస్ను 3-1 తేడాతో ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్లోనూ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. సిరీస్ ఫలితం తేలడంతో ఐదో టీ20 నామమాత్రమే. కానీ, ఆసియా కప్కి ముందు సన్నాహకంగా ఇదే చివరి మ్యాచ్ అవుతుంది. దీంతో గెలుపుతో ముగించాలని భారత్ భావిస్తోంది.
విండీస్ పర్యటన ముగిసిన తర్వాత భారత్ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను ఆడనుంది. కాబట్టి రిజర్వ్ బెంచ్ను పరీక్షించేందుకు భారత్కు మరొక అవకాశం. విండీస్ తో చివరి మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. టాస్ నెగ్గిన హార్దిక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, సిరీస్ను కోల్పోయిన విండీస్.. కనీసం చివరి మ్యాచ్లోనైనా గెలుపొంది రువు నిలుపుకోవాలని ఆశిస్తోంది.
భారత జట్టు : ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, దినేశ్ కార్తిక్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్.
వెస్టిండీస్ జట్టు : షమ్రా బ్రూక్స్, షిమ్రోన్ హెట్మయేర్, నికోలస్ పూరన్ (కెప్టెన్), డేవన్ థామస్, జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, కీమో పాల్, డొమినిక్ డ్రేక్స్, మెకాయ్, హేడెన్ వాల్ష్, రోవ్మన్ పావెల్.
Innings Break!
A solid batting display from #TeamIndia to post 188/7 on the board. ? ?
Over to our bowlers now. ?
Scorecard ? https://t.co/EgKXTtbLEa #WIvIND pic.twitter.com/Xo2InbzUEh
— BCCI (@BCCI) August 7, 2022
.@ShreyasIyer15 scored a superb 6️⃣4⃣ & was our top performer from the first innings of the fifth #WIvIND T20I. ??
A summary of his knock ?#TeamIndia pic.twitter.com/19hPbygwfS
— BCCI (@BCCI) August 7, 2022