J. P. Nadda: జేపీ నద్దా ఏపీ పర్యాటన ఖరారు

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా వచ్చే నెలలో ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. జూన్ 6, 7 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. జూన్ 6న ఉదయం విజయవాడ చేరుకుంటారు. అక్కడ రాష్ట్రస్థాయి శక్తి కేంద్ర ఇంఛార్జ్‌లతో సమావేశమవుతారు.

J. P. Nadda

J. P. Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా వచ్చే నెలలో ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. జూన్ 6, 7 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. జూన్ 6న ఉదయం విజయవాడ చేరుకుంటారు. అక్కడ రాష్ట్రస్థాయి శక్తి కేంద్ర ఇంఛార్జ్‌లతో సమావేశమవుతారు. సాయంత్రం నగరంలో జరిగే మేధావుల సమావేశంలో పాల్గొంటారు. జూన్ 7న రాజమండ్రిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు వివిధ రంగాల ప్రముఖులతో సమవేశమవుతారు. రాజమండ్రిలో జరిగే సభలో ఏపీ రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాల్ని నద్దా వెల్లడించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

monkeypox: ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?

మోదీ అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జేపీ నద్దాతోపాటు ఇతర బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. అందుకే ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాల్లో మోదీ సహా జాతీయ స్థాయి నేతలు పాల్గొంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు