Minister Errabelli Comments Bandi Sanjay : బండి సంజయ్ పాదయాత్రలో 500 మంది గూండాలు..మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ యాత్రలో 500 మంది గూండాలు ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్-బీజేపీ పరస్పర ఘర్షణలో గాయపడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.
- bheemraj
- Published On : August 15, 2022 / 07:36 PM IST
Minister Errabelli comments Bandi Sanjay
Minister Errabelli Comments Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ యాత్రలో 500 మంది గూండాలు ఉన్నారని ఆరోపించారు. టీఆర్ఎస్-బీజేపీ పరస్పర ఘర్షణలో గాయపడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.
BJP-TRS: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ-టీఆర్ఎస్ ఘర్షణ
అనంతరం మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దన్నందుకే టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని పేర్కొన్నారు. అన్యాయంగా టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ గూండాలు.. రాళ్లు, కర్రలతో టీఆర్ఎస్ నేతలపై దాడి చేశారని పేర్కొన్నారు.
