Modi: కాసేపట్లో ఏపీకి ప్రధాని మోదీ.. ప్రధానితో కలిసి అల్లూరి విగ్రహావిష్కరణలో పాల్గొననున్న జగన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
- T Venkateshwarlu
- Published On : July 4, 2022 / 09:08 AM IST
Jagan Meets Modi
Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. మోదీతో పాటు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. భీమవరంలో క్షత్రియ సేవాసమితి 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
Denmark: డెన్మార్క్లోని షాపింగ్ మాల్లో కాల్పుల కలకలం.. ఉగ్రవాదుల చర్యే?
అయితే, కార్యక్రమాలకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. కాసేపట్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భీమవరానికి ఉదయం 10.55కి చేరుకుంటారు. అయితే, అనంతరం సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. దాదాపు గంట 15 నిమిషాలు విగ్రహావిష్కరణ, సభ వద్ద ఉంటారు. మరోవైపు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు సినీనటుడు చిరంజీవి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన భీమవరం చేరుకుని అల్లూరి సీతారామరాజు 125వ జయంతి, విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
