Mumbai Police : ప్రయాణిస్తున్న బస్సు ఆగిపోయి మొరాయిస్తే మామూలుగా జనం ఏం చేస్తారు?.. అందరూ బస్సు దిగిపోయి హడావిడిగా వేరే బస్ని క్యాచ్ చేస్తారు. కానీ ముంబయిలో ప్యాసింజర్లు మంచి పని చేసి పోలీసుల ప్రశంసలు అందుకున్నారు.
ముంబయి ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇక ఉద్యోగాలకు వెళ్లే టైంలో మరింత హడావిడి కనిపిస్తుంది. అలాంటి టైంలో ఓ ఫ్లై ఓవర్పై బస్సు ట్రబుల్ ఇచ్చి నిలిచిపోయింది. పనులకు, ఉద్యోగాలకు వెళ్లే టైంలో బస్సు ట్రబుల్ ఇస్తే జనం ఒక్క క్షణం నిలబడతారా? తిట్టుకుంటూ వేరే బస్సు కోసం పరుగులు తీస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. బస్సు దిగిన ప్రయాణికులంతా కలిసి బస్సును నెడుతూ డ్రైవర్కి సాయం అందించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘ ఇది చాలా విలువైన సమయం.. అయినా కూడా సమయం పక్కన పెట్టి ఒకరికొకరు ఎంత సాయం చేసుకున్నామనేది ముఖ్యం’ అనే శీర్షికతో ఈ వీడియోను మొదటగా @medohh777 ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. ఆ వీడియోను ముంబయి పోలీసులు ”ముంబయి మూమెంట్స్ – Ctrl+S! ..ముంబయి బలం ముంబైకర్లే.. మా పోలీస్ స్నేహితుడు అక్కడివారితో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందంటూ’ ఈ వీడియోని షేర్ చేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ‘ఐకమత్యంతో ఉంటే విజయం సాధిస్తామన్నది ఇలాంటి ఘటనలు చూస్తుంటే అర్ధమవుతుందని కొందరు.. ఇలా సాయపడే తత్వం ముంబయిలో మాత్రమే ఉందని’ మరికొందరు కామెంట్లు పెట్టారు. ఇక సమస్యలపైనా.. సంబరాలపైనా ముంబయి పోలీసులు సోషల్ మీడియాల బాగానే స్పందిస్తూ ఉంటారు. ఇలా జనానికి-పోలీసులకి మధ్య స్నేహ పూరిత వాతావరణ ఉంటే క్రైం రేటు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
Good morning, So this is the precious moment when those people ignoring the busy schedule and helping eachother for a moment, Doest matter how much you late or upto but helping eachother is all we do!!@MumbaiPolice @mybmc @TOIMumbai @narendramodi @abpmajhatv @BBCHindi @ABPNews pic.twitter.com/phE5yvxtMB
— medoh (@medohh777) April 29, 2023