Bharat Jodo Yatra: రాహుల్‌కు ఘన స్వాగతం.. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. ఫొటోలు

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోడెర్లీ గ్రామం నుంచి బుధవారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీకి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. బుర్హాన్‌పూర్ జిల్లాలోని సెయింట్ జేవియర్ ఇంటర్నేషనల్ స్కూల్ జైనాబాద్ ఫటా వద్ద బోడెర్లీ బస్టాండ్ నుండి యాత్ర ప్రారంభమైంది. ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ పాదయాత్రగా ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో విస్తరిస్తున్న ద్వేషం, హింస, భయాలకు వ్యతిరేకంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కన్యాకుమారి నుంచి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లోకి తీసుకుని భారత్ జోడో యాత్రను ప్రారంభించాం. ఈ త్రివర్ణ పతాకాన్ని శ్రీనగర్ చేరుకోకుండా ఎవరూ ఆపలేరంటూ రాహుల్ అన్నారు. ఈ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 11రోజులుపాటు సాగనుంది.

1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

ట్రెండింగ్ వార్తలు