Bharat Jodo Yatra: బుల్లెట్ ఎక్కిన రాహుల్ గాంధీ.. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. (ఫొటోలు)

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. రాష్ట్రంలో యాత్ర ఐదవరోజు ఇండోర్‌కు చేరుకుంటుంది. సాయంత్రం నగరంలోని నడిబొడ్డున రాజ్‌వాడలో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. ఆదివారం ఉదయం 6గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. భారీ సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ వెంట యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ బుల్లెట్ నడిపి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. స్థానిక యువతీ, యువకులు, చిన్నారులు రాహుల్‌తో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.

1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

ట్రెండింగ్ వార్తలు