Train Accident in Maharastra : మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ బిలాస్పుర్ నుంచి రాజస్థాన్ జోధ్పుర్కు వెళ్తున్న భగత్ కి కోఠీ ప్యాసింజర్ ట్రైన్.. ఓ గూడ్స్ ట్రైన్ను ఢీకొట్టింది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.కాగా ఈ ఘటనలో ప్రమాదానికి గురి అయిన రైలు తిరిగి ప్రయాణించి గోందియాకు చేరాల్సిన రైలు ఉదయం 5.44గంటలకు చేరుకుంది.
Updated information from Indian Railways in Gondia incident: Re-railment completed at 4.30 am, affected train left site at 5.24 am & arrived Gondia at 5.44 am. Up & Down traffic resumed at 5.45am. One bogie derailed, only 2 persons with minor injuries treated & left in same train https://t.co/oljLBrza7x
— ANI (@ANI) August 17, 2022