Kanpur : డ్రైవింగ్ నేర్చుకునేటపుడు కాస్త జాగ్రత్తలు అవసరం. రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లేటపుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే స్టీరింగ్ పట్టుకున్న ఓ మహిళ ఆగి ఉన్న బైక్ లపైకి కారు పోనిచ్చేసింది. ఇంకేముందు కారు కింద పడి బైక్ లన్నీ నలిగిపోయాయి. ఇక పోలీసులు ఊరుకుంటారా?
కాన్పూర్లో ఓ మహిళ తన కారుతో రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్లను ఢీకొట్టింది. కారును బైక్ల మీద నుంచి నడిపేసింది. ఈ ఘటనలో బైక్లు కారు కింద పడి నలిగిపోయాయి. ఇంకేముంది ఒక్కసారిగా జనం గుమిగూడారు. ఆమె అంత నిర్లక్ష్యంగా బైక్ నడపడంపై మండిపడ్డారు. అయితే తాను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్లు ఆ మహిళ చెప్పింది. కారులో కూర్చుని ఆందోళన పడుతున్న మహిళకు అక్కడ ఉన్న కొందరు ధైర్యం చెప్పారట.
ఈ ఘటనలో అజాగ్రత్తగా డ్రైవింగ్ చేసినందుకు ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారట. అంతేకాదు 2500 రూపాయలు జరిమానా కూడా విధించారట. అయితే పోలీసుల సమక్షంలో ఇరు వర్గాలు ఒప్పందం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగిందని తెలుస్తోంది.