Bangladesh woman: ఇండియాలో ఉన్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు బంగ్లాదేశ్ నుంచి ఈదుకుంటూ వచ్చిందో 22 ఏళ్ల యువతి. బంగ్లాదేశ్కు చెందిన క్రిష్ణా మండల్ అనే యువతికి ఫేస్బుక్లో కోల్కతాకు చెందిన అభిక్ మండల్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే, క్రిష్ణకు ఇండియా వచ్చేందుకు పాస్పోర్ట్ లేదు. దీంతో ఇండియా ఎలా రావాలో తెలియదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఇండియాలో ఉన్న ప్రియుడిని చేరుకోవాలనుకున్న క్రిష్ణ, ముందుగా సబర్బన్ అడవులకు చేరుకుంది. ఈ అడవులు రాయల్ బెంగాల్ పులులకు ప్రసిద్ధి. పులులు ఉంటాయని తెలిసినా ఆమె భయపడలేదు.
Maggi Noodles: రోజూ మ్యాగీ చేసిపెట్టిన భార్య.. విడాకులిచ్చిన భర్త
ఈ అడవుల్లో నడుస్తూ, మధ్యలో ఉన్న నదిలో గంటపాటు ఈదుకుంటూ వచ్చింది. చివరకు ఇండియా చేరుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తన ప్రియుడిని కలుసుకుంది. మూడు రోజుల క్రితం ఇద్దరూ కలిసి కోల్కతాలోని కాళిఘాట్ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే, పాస్పోర్ట్ లేకుండా, అక్రమంగా దేశంలోకి ప్రవేశించిందనే కారణంగా భారత అధికారులు క్రిష్ణను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను బంగ్లాదేశ్ ఎంబసీకి అప్పగించారు. ఇటీవల ఒక పదిహేనేళ్ల బాలుడు కూడా బంగ్లాదేశ్ నుంచి చాక్లెట్లు కొనుక్కోవడానికి ఇలాగే ఇండియాకు వచ్చాడు. నదిలో ఈదుకుంటూ వచ్చిన అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.