Bile Acid Diarrhea : వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే బైల్ యాసిడ్ డయేరియా ! ఒక సాధారణ రక్త పరీక్ష తో దీనిని గుర్తించవచ్చు..
రక్త నమూనాలో వందలాది విభిన్న జీవక్రియలు ఉంటాయి. ఈ అణువులలో కొన్నింటిని బైల్ యాసిడ్ డయేరియాను నిర్ధారించడానికి ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం, బైల్ యాసిడ్ డయేరియా నిర్ధారణలో రేడియోఫార్మాస్యూటికల్స్ ఉంటాయి. ఇది రోగులకు రేడియేషన్ ప్రమాదాన్ని కలిగిస్తుంది.
- Guntupalli Ramakrishna
- Published On : July 7, 2023 / 11:45 AM IST
Bile Acid Diarrhea
Bile Acid Diarrhea : అతిసారం కారణంగా తరచుగా బాత్రూమ్కు వెళ్లాల్సి వస్తే శరీరం అలసిపోతుంది అంతేకాకుండా చికాకు కలిగిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో డయేరియా అనేది ఒక సాధారణ సమస్య. వివిధ కారకాలు వర్షాకాలంలో అతిసారం ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే అత్యంత సాధారణ కారణం కలుషితమైన ఆహారం , నీటి వినియోగం.
READ ALSO : Cholesterol : కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు తినటం అనారోగ్యకరమా? వాస్తవాలు, అపోహలు..
అతిసారం అన్నది రెండు మూడురోజులకు తగ్గిపోతే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ దీర్ఘకాలిక అతిసారం రోగి యొక్క రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. బైల్ యాసిడ్ మాలాబ్జర్ప్షన్ లేదా బైల్ యాసిడ్ డయేరియా అనేది దీర్ఘకాలిక డయేరియా యొక్క ఒక రూపం. ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఆలస్యంగా నిర్ధారణ అవుతుంది. కొంద మందిలో రోగనిర్ధాణ జరగదు. ఈ బైల్ యాసిడ్ గురించి చాలా మందిలో అవగాహన ఉండదు.
READ ALSO : Summer Health Problems : వేసవి కాలంలో ఎదురయ్యే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవే?
అతిసారం వ్యాధిని నిర్ధారించే ప్రస్తుత ప్రక్రియ సంక్లిష్టమైనది, ఖరీదైనది. ఈ దీర్ఘకాలిక విరేచనాలను నిర్ధారించడానికి, ప్రభావవంతమైన చికిత్సను అందించటానికి పరిశోధకులు కొత్త మార్గాలను కనుగొన్నారు. రోజుకు 10 సార్లు కంటే ఎక్కువ బాత్రూమ్కు వెళ్లవలసి వస్తే బైల్ యాసిడ్ డయేరియాతో బాధపడుతున్నారని నిర్ధారించుకోవాలి. ఈ అతిసారానికి ఇది దీర్ఘకాలిక లక్షణం.
READ ALSO : Anger Management : కోపంతో ఉన్నప్పుడు నివారించాల్సిన 6 ఆహారాలు ఇవే !
చాలా మంది ఈ రకమైన దీర్ఘకాలిక విరేచనాలతో బాధపడుతున్నారు. దాని గురించి కనీసం వారికి అవగాహన ఉండటంలేదు. మెజారిటీ కేసులు చివరి దశలో రోగనిర్ధారణ చేయబడతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి ప్రాణాంతకమైనది కానప్పటికీ, ఇది రోగి యొక్క సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
బైల్ యాసిడ్ డయేరియాను సాధారణ రక్త పరీక్షతో నిర్ధారించవచ్చు;
ప్రొఫెసర్ ఆండర్సన్ మరియు అతని పరిశోధనా బృందం సాధారణ రక్త నమూనా ఆధారంగా వ్యాధి నిర్ధారణ కోసం ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. ఇది రక్తంలో మెటాబోలైట్స్ అని పిలువబడే అణువులపై దృష్టి పెడుతుంది. బైల్ యాసిడ్ డయేరియా రోగులలో, రక్తంలోని జీవక్రియలు ఒక నిర్దిష్ట నమూనాను ఏర్పరుస్తాయి. అది వాటిని గుర్తిస్తుందని ప్రొఫెసర్ అండర్సన్ చెప్పారు.
READ ALSO : Curd Rice In Summer : వేసవిలో ఎండల తీవ్రత నుండి శరీరాన్ని చలబరిచే పెరుగన్నం !
రక్త నమూనాలో వందలాది విభిన్న జీవక్రియలు ఉంటాయి. ఈ అణువులలో కొన్నింటిని బైల్ యాసిడ్ డయేరియాను నిర్ధారించడానికి ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతం, బైల్యా సిడ్ డయేరియా నిర్ధారణలో రేడియోఫార్మాస్యూటికల్స్ ఉంటాయి. ఇది రోగులకు రేడియేషన్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. USతో సహా అనేక దేశాలు ఈ పద్ధతిని నిరాకరిస్తున్నాయి.
సాధారణ రక్త నమూనా ఆధారంగా బైల్ యాసిడ్ డయేరియా ఉన్న రోగులను గుర్తించడానికి, సరైన చికిత్సను సిఫార్సు చేయడానికి కొత్త పద్ధతి వైద్యులకు సహాయపడుతుంది. క్లినికల్ అధ్యయనంలో, హెర్లెవ్ మరియు జెంటోఫ్టే హాస్పిటల్లోని వైద్యులు, లిరాగ్లుటైడ్ (సాధారణంగా టైప్ 2 మధుమేహం మరియు తీవ్రమైన అధిక బరువు చికిత్సకు ఉపయోగించే ఔషధం)తో కూడిన బైల్ యాసిడ్ డయేరియా కొత్త చికిత్స యొక్క సామర్థ్యాన్ని పరీక్షించారు.
READ ALSO : Summer Drinks : వేసవి ఎండల కారణంగా ఎదురయ్యే డీహైడ్రేషన్ కు చెక్ పెట్టాలంటే ?
లిరాగ్లుటైడ్ చికిత్స 77 శాతం మంది రోగుల లక్షణాలను తగ్గించింది. అయితే 50 శాతం మంది రోగులు బైల్ యాసిడ్ సీక్వెస్ట్రెంట్ కోలెస్వెలమ్తో కూడిన సాంప్రదాయిక చికిత్సకు బాగా స్పందించారు. అధ్యయన ఫలితాల ఆధారంగా, రోగుల రక్తంలోని జీవక్రియలు ఏ చికిత్స అత్యంత ప్రభావవంతంగా ఉంటుందో నిర్ణయించడంలో సహాయపడవచ్చని ప్రొఫెసర్ అండర్సన్ సూచించారు.
