స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న‘అల వైకుంఠపురములో’ టీజర్ రిలీజ్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల వైకుంఠపురములో’.. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. అల్లు అరవింద్, ఎస్.రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
‘మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచాడు నిన్ను.. సరిగ్గా చూడలేదెప్పుడూ.. ముందుకు రా’ అంటూ సచిన్ కేద్కర్ చెప్పే డైలాగుతో ప్రారంభమైన వైకుంఠపురం టీజర్ ఆసక్తికరంగా ఉంది. ‘స్టైల్గా ఉంది కదా.. నాక్కూడా నచ్చింది’.. ‘మేడమ్ సార్.. మేడమ్ అంతే’ అంటూ బన్నీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయి.
టీజర్ చివర్లో ‘మీరిప్పుడే కార్ దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా’ అంటూ సముద్రఖనితో చెప్పే డైలాగ్, కత్తితో బీడీ వెలిగించడం వంటివి ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. టబు, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, నివేదా పేతురాజ్, సునీల్, సుశాంత్, నవదీప్, మురళీశర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.