Anasuya Bharadwaj Shares 24 Years Before Photo and says Interesting Story
Anasuya Bharadwaj : యాంకర్ గా అనసూయ సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న తర్వాత నటిగా బిజీ అయింది. ప్రస్తుతం పెద్ద చిన్న అని తేడా లేకుండా చాలా సినిమాల్లో అనసూయ నటిస్తూ బిజీగా ఉంది. మరో వైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసి ఆసక్తికర విషయాన్ని తెలిపింది.
మొదట కొంతమంది NCC మెంబర్స్ ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి అందులో తాను ఎక్కడ ఉందో కనిపెట్టమంది. ఆ తర్వాత ఆ ఫొటోలో తనని హైలెట్ చేస్తూ.. చాలామంది బాగా కరెక్ట్ గా గెస్ చేశారు. 2000 సంవత్సరంలో న్యూఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో జరిగినప్పుడు తీసిన ఫోటో ఇది. స్కూల్ లెవల్లో నేను AP జూనియర్ వింగ్ NCC కమాండర్ ని. అప్పుడు 15 స్టేట్స్ తో పోటీపడి మేము థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నాము. నా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో NCC చాలా తోడ్పడింది అని మెమరీ గుర్తొచ్చింది అంటూ పోస్ట్ చేసింది. ఆ తర్వాత ప్రజెంట్ ఫొటో షేర్ చేసి.. 24 ఏళ్ళు అయిపొయింది, చాలా ఛేంజ్ అయ్యాను అని పోస్ట్ చేసింది.
Also Read : Guntur Kaaram : ‘కుర్చీ మడతపెట్టి’.. సరికొత్త రికార్డ్ సెట్ చేసిన మహేష్ బాబు, శ్రీలీల..
దీంతో అనసూయ స్కూల్ లెవల్లో NCC మెంబర్ గా ఉన్న ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇది 24 ఏళ్ళ క్రితం ఫోటో. అంటే అనసూయకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు తీసింది. అనసూయ అప్పుడు, ఇప్పుడు చాలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.