Bhairavam movie ott streaming date fix
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది.
ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జూలై 18 నుంచి తెలుగు, హిందీ భాషల్లో భైరవం మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు జీ5 తెలిపింది. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఓటీటీలో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సిందే.
MM Keeravani : కీరవాణి ఇంట తీవ్ర విషాదం.. ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత శివశక్తి దత్త కన్నుమూత..
Powerful. Intense. A story that leaves you with an afterthought – BHAIRAVAM
Get ready for a high voltage thriller
Premieres 18th Jul@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @DirVijayK @AditiShankarofl @anandhiactress @DivyaPillaioffl @KKRadhamohan @dophari @satyarshi4u pic.twitter.com/3i6s0aKJKI
— ZEE5 Telugu (@ZEE5Telugu) July 8, 2025
వెయ్యి కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూముల మీద రాజకీయ నాయకుడు కన్నువేయడం, ఆ భూమిని కాపాడేందుకు ధర్మకర్త ముగ్గురు హీరోల చేసే ప్రయత్నాలు ఏంటి? ఈ ముగ్గురు హీరోల పాత్రలు చివరకు ఎలా ముగుస్తాయి? ఈ క్రమంలో ఎవరెవరు ఏ దారిని ఎంచుకుంటారు? అన్న కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది.