Ajith : టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, తమిళ్ స్టార్ హీరో అజిత్ మరోసారి తలపడనున్నారు. గత నెల వీరిద్దరి సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. అజిత్ నటించిన ‘వలిమై’ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 24న రిలీజ్ అవ్వగా, పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అయింది. అలా వీరిద్దరూ తలపడ్డారు. ‘వలిమై’ సినిమా తమిళ్ లో మంచి సక్సెస్ సాధించినా వేరే భాషల్లో అంతగా మెప్పించలేకపోయింది. ఇక ‘భీమ్లా నాయక్’ కూడా తెలుగులో మంచి విజయం సాధించింది.
NTR : నాన్న గారి ఆ సినిమాని రీమేక్ చేయాలనుంది
తాజాగా వీరిద్దరూ నెల తిరక్కుండానే మళ్ళీ పోటీ పడుతున్నారు. పవన్కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది. ‘భీమ్లా నాయక్’ ప్రముఖ ఓటీటీలు ఆహా, డిస్నీప్లస్ హాట్స్టార్లలో మార్చి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అజిత్ ‘వలిమై’ కూడా అదే రోజు మార్చి 25వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. మొన్న థియేటర్లలో జరిగినపోరు ఇప్పుడు ఓటీటీలలో జరగనుంది. మరి ప్రేక్షకులు ఏ సినిమాని ఎక్కువగా చూస్తారో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.