Ponnambalam : తమిళ నటుడు ‘పొన్నంబలం’.. ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తరువాత సినిమాల్లో విలన్ గా కనిపించి సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులోకి చిరంజీవి ఘరానా మొగుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత తెలుగులో పలు సినిమాలో విలన్ గా కనిపించాడు. కాగా ఈ నటుడు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. చికిత్స చేయించుకోడానికి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకొనే ఆలోచన కూడా చేసినట్లు గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
RRR : ఈ విజయాన్ని చరణ్కి మాత్రమే యాట్రిబ్యూట్ చేయకండి.. చిరంజీవి!
కాగా ఈ ఫిబ్రవరి 10న చెన్నై అపోలో హాస్పిటల్లో విజయవంతమైన కిడ్నీ మార్పిడి చేయించుకున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక తమిళ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో పొన్నంబలం మాట్లాడుతూ.. నేను అతిగా తాగడం వలనే నాకు కిడ్నీ సమస్య వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. కానీ నా సోదరుడే నన్ను చంపాలని చూశాడు. మా నాన్నకు నలుగురు భార్యలు. మూడో భార్య కొడుకు నా మేనేజర్గా పని చేసేవాడు. నా ఎదుగుదలను తట్టుకోలేక నా ఆహారంలో స్లో పాయిజన్ కలిపి ఇచ్చాడు. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది అంటూ చెప్పుకొచ్చాడు.
RRR : నేను ఆస్కార్కి గెస్ట్గా మాత్రమే వెళ్ళాను.. కానీ నేడు చరణ్ అండ్ తారక్.. చిరంజీవి!
ఇక వైద్యం చేయించుకోడానికి కూడా డబ్బులు లేని సమయంలో చిరంజీవికి కాల్ చేసి తన పరిస్థితి చెప్పాడట. చిరంజీవి వెంటనే సంపాందించి 5 నిమిషాల్లో చెన్నైలో ఉన్న అపోలో లో అడ్మిట్ చేయించాడట. సహాయం అడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే.. హాస్పిటల్ ఎంట్రీ ఫీస్ కూడా కట్టనివ్వకుండా మొత్తం హాస్పిటల్ ఖర్చు 40 లక్షల చిరునే చూస్కున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అలాగే తమిళ స్టార్స్ కమల్ హాసన్, శరత్ కుమార్, ధనుష్ తదితరులు కూడా తనకి సహాయం చేసినట్లు వెల్లడించాడు.
నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో ఎవరినడగాలో తెలియక @KChiruTweets గారినడిగితే 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే – నేనున్నా అని చెప్పి 5ని||లో దగ్గరలో ఉన్న అపోలో కి వెళ్ళమని అడ్మిట్ అవ్వమన్నారు – అక్కడ నన్ను ఎంట్రీ ఫీస్ కూడా అడగలేదు
మొత్తం 40లక్షలయ్యంది ఆయనే చూస్కున్నారు🙏 pic.twitter.com/HHdBcSiwPm
— 𝙺𝙰𝙺𝙸𝙽𝙰𝙳𝙰 𝙼𝙴𝙶𝙰 𝙳𝙴𝚅𝙾𝚃𝙴𝙴 (@Gowtham__JSP) March 15, 2023