కరోనా ఎఫెక్ట్ – హీరోయిన్ తండ్రి మరణం : కోలుకున్న మరో నటి

కరోనా కారణంగా సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ మరణించారు. నటి ఓల్గా కురెలెంకో కరోనా నుండి కోలుకున్నారు..

  • Publish Date - March 23, 2020 / 12:55 PM IST

కరోనా కారణంగా సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ మరణించారు. నటి ఓల్గా కురెలెంకో కరోనా నుండి కోలుకున్నారు..

క‌రోనా వైర‌స్ రోజురోజుకి విల‌య‌తాండ‌వం చేస్తుంది. ప్ర‌జ‌లంద‌రూ భ‌య‌ప‌డి బయ‌ట‌కు రావ‌డ‌మే మానేశారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి సోఫియా మైల్స్ తండ్రి పీట‌ర్ మైల్స్(67) క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో చ‌నిపోయారు. పార్కిన్‌స‌న్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న పీట‌ర్‌కు క‌రోనా సోకింది. ఆయ‌న్ని హాస్ప‌టల్‌లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయ‌న కోలుకోలేక శ‌నివారం తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని సోఫియా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. 

 

‘జేమ్స్‌బాండ్‌’ హీరోయిన్‌ ఓల్గా కురెలెంకో కరోనా వైరస్‌ బారినుంచి బయటపడ్డారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె పూర్తిగా కోలుకున్నారు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓల్గా స్పందిస్తూ తాను పూర్తిగా కోలుకున్నానని తెలిపుతూ.. కుమారుడితో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేశారు. ‘‘ నేను పూర్తిగా కోలుకున్నాను. మొదటి వారం రోజులు చాలా కష్టంగా గడిచింది. విపరీతమైన జ్వరం, తలనొప్పితో బాధపడ్డాను. రెండో వారంలో జ్వరం తగ్గిపోయింది. కొద్దిగా దగ్గు ప్రారంభమైంది. చాలా అలసిపోయినట్లు ఉండేది. రెండో వారం చివర్లో ఆరోగ్యం కుదుట పడింది. దగ్గు తగ్గినప్పటికీ ఉదయం వేళల్లో కొద్దిగా ఇబ్బంది పెట్టేది. కానీ, ఈ రోజు అది కూడా లేదు.

ఇప్పుడు నా కుమారుడితో కలిసి సమయాన్ని గడుపుతున్నా’’నని పేర్కొన్నారు. కాగా, కొద్దివారాల క్రితం ఓల్గాకు కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆమె ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఈమె 2008లో వచ్చిన జేమ్స్‌బాండ్‌ మూవీ ‘క్వాంటం ఆఫ్‌ సొలేస్‌’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

 

 

ట్రెండింగ్ వార్తలు