fight between Baby Movie unit and media reporters at bhimavaram
Baby Movie : నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. జూలై 14న ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ ని అందుకుంది. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు 75 కోట్లకు పైగా అందుకొని ముందుకు దూసుకుపోతుంది. దీంతో మూవీ టీం వరుస సక్సెస్ సెలబ్రేషన్స్ తో సందడి చేస్తుంది.
Salaar : డైనోసార్ వచ్చే సమయం అయ్యింది.. సలార్ నుంచి ప్రభాస్ గ్లింప్స్.. పోస్ట్ వైరల్..
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ మూవీ టీం సందడి చేయడానికి వెళ్ళింది. అయితే ఆ ఈవెంట్ ని కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు, చిత్ర యూనిట్ మధ్య వాగ్వాదం జరిగి గాయాలు అయ్యేవరకు వెళ్లినట్లు సమాచారం. గొడవకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక తెలియలేదు. కానీ ఈ వాగ్వాదంలో మీడియా ప్రతినిధుల పై నిర్మాత కూడా దౌర్జన్యం చేసినట్లు, ఈ క్రమంలోనే బౌన్సర్లతో మీడియా వారిపై దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో ఒక జర్నలిస్ట్కి గాయం కూడా అయ్యినట్లు తెలుస్తుంది.
Vaishnavi Chaitanya : అదిరిపోయే ఆఫర్ అందుకున్న బేబీ.. ఏకంగా సూపర్ హిట్ సీక్వెల్లో హీరోయిన్గా..
ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అక్కడ పరిస్థితులను చక్కబెట్టేలా చూస్తున్నారు. కాగా బేబీ సినిమాని SKN నిర్మించాడు. తాను నిర్మించిన రెండో సినిమా ఇది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరో అయితే, మొదటి మూవీ టాక్సీవాలాలో విజయ్ దేవరకొండ హీరో. ప్రస్తుతం థియేటర్స్ లో బేబీ మూవీకి వస్తున్న ఆదరణ చూస్తుంటే.. లాంగ్ రన్ లో 100 కోట్లు అందుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ మూవీ ఆ మార్క్ ని అందుకొని రికార్డు క్రియేట్ చేస్తుందా? లేదా? చూడాలి.