Mahesh Babu : మహేష్ బాబు స్పెషల్ పోస్ట్.. ప్రతి క్షణం వారితో ఆస్వాదించడం..

మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్ న్యూ పోస్టు చూశారా. వారితో ప్రతి క్షణం ఆస్వాదించడం..

Guntur Kaaram star Mahesh Babu new instagram post viral

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇది ఇలా ఉంటే, మహేష్ బాబు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్టు వేశారు. ఆ పోస్టులో మహేష్ ఇలా రాసుకొచ్చారు. ప్రతి క్షణం వారితో ఆస్వాదించడం తనకి ఆనందం అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ మహేష్ కి సంతోషం కలిగించిన ఆ వ్యక్తులు ఎవరు..?

మహేష్ బాబుకి అత్యంత సంతోషం కలిగించే వ్యక్తులు అంటే ఇంకెవరు ఉంటారు.. ఆయన ఫ్యామిలీనే. షూటింగ్స్ ఒక చిన్న బ్రేక్ వచ్చినా వారితో కలిసి ఏదొక దేశానికీ టూర్ కి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఈక్రమంలోనే గతంలో పారిస్ వెళ్లి అక్కడ ఫ్యామిలీతో కలిసి ఒక రెస్టారెంట్ లో తమకి ఇష్టమైన ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోని షేర్ చేశారు. త్రో బ్యాక్ పిక్ అంటూ.. నా ఫేవరెట్ పీపుల్‌తో ప్రేమదేశం పారిస్ లో ప్రతి క్షణం ఆస్వాదించాను అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Kamal – Rajini : ఒకే ఫ్రేమ్‌లో కమల్, రజినీ.. ఎందుకు కలిశారో తెలుసా..?

ఇక గుంటూరు కారం విషయానికి వస్తే.. హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక మొదటి సాంగ్ ‘దమ్ మసాలా’తో మాస్ ని బాగా ఆకట్టుకున్న మూవీ టీం.. ఇప్పుడు రెండో సాంగ్ ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. వచ్చే వారం ఈ సెకండ్ సాంగ్ రిలీజ్ పై అప్డేట్ రానుందని నిర్మాత నాగవంశీ తెలియజేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు