Kamal – Rajini : ఒకే ఫ్రేమ్లో కమల్, రజినీ.. ఎందుకు కలిశారో తెలుసా..?
ఒకే షూటింగ్ స్పాట్ లో కమల్ హాసన్, రజినీకాంత్ అంటూ నిర్మాతలు పోస్టు వైరల్. ఎందుకు కలుసుకున్నారో తెలుసా..?
Kamal Haasan – Rajinikanth : కోలీవుడ్ లెజెండ్స్ కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఇద్దరు ప్రస్తుతం వారి వారి సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. కమల్ ‘ఇండియన్ 2’, రజినీ ‘తలైవర్ 170’ సెట్స్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి కనిపించడంతో.. ఏదైనా మల్టీవర్స్ ని క్రియేట్ చేస్తున్నారా..? అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అసలు విషయం ఏంటంటే.. ఇండియన్ 2, తలైవర్ 170 మూవీ షూటింగ్స్ ఒక స్టూడియోలో జరుగుతుందట. ఇక ఒకేచోట ఉండడంతో ఈ ఇద్దరు ఒకరి సెట్స్ ఒకరు వెళ్లి సందడి చేశారు. అనంతరం ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఇద్దరి ఇలా ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. అయితే 20’s లో మాత్రం ఈ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు. వీరిద్దరూ కలిసి మళ్ళీ ఒక సినిమాలో కలిసి నటిస్తే చూడాలని చాలామంది ఆశపడుతున్నారు.
Also read : Suriya : ‘కంగువ’ షూటింగ్ సెట్లో గాయపడిన హీరో సూర్య..
The 2 unparalleled LEGENDS of Indian Cinema ‘Ulaganayagan’ @ikamalhaasan & ‘Superstar’ @rajinikanth sharing a lighter moment while shooting for their respective films Indian-2 & Thalaivar170 in the same studio after 21 years! 🤗✨
And we @LycaProductions are super happy & proud… pic.twitter.com/8cKcqGwitV
— Lyca Productions (@LycaProductions) November 23, 2023
కాగా కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రజినీకాంత్ కూడా లోకేష్ దర్శకత్వంలో నటించబోతున్నారు. అయితే ఆ సినిమా LCUలో భాగమా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆ చిత్రం కూడా LCUలో భాగంగా తెరకెక్కితే కమల్, రజినీ కోరిక నెరవేరినట్లే అవుతుంది. ఈ ఇద్దరు లెజెండ్స్ ని మరోసారి ఒకే ఫ్రేమ్ లో వెండితెర మీద చూసుకునే అవసకం కలుగుతుంది. మరి లోకేష్ కనగరాజ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.