జీ తెలుగు సీరియల్స్ జగద్ధాత్రి, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, మా అన్నయ్య నటీనటులు, ప్రేక్షకుల ఆత్మీయ సమ్మేళనం తాజాగా మంచిర్యాలలో జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం జగద్ధాత్రి ఇంట మిత్ర, లక్ష్మీల కలయిక పేరుతో మార్చి 31న రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
జగద్ధాత్రి(దీప్తి మన్నె), కేదార్(దర్శ్ చంద్రప్ప), మిత్రనందన్ (రాఘవేంద్ర), లక్ష్మీ(మహీ గౌతమి) జంటలు ఈ ప్రోగ్రాంలో టవల్ లాకింగ్ గేమ్ తో పాటు సరదా ఛాలెంజ్లు, ఉట్టి కొట్టడం, అంత్యాక్షరి ఆడారు. అలాగే, హోలీ వేడుక సరదాగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఆయా సీరియళ్ల నటీనటులు తమ అభిమానులతో సరదాగా సంభాషించారు. వారికి బహుమతులను కూడా అందించారు. డ్రామా జూనియర్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గానం ప్రేక్షకులను అలరించింది. మా అన్నయ్య సీరియల్ నటుడు గోకుల్ మీనన్కి ఓ వికలాంగురాలు రాఖీ కట్టారు. జీ తెలుగు నటీనటులతో అభిమానులు సెల్ఫీలు దిగారు.
Maa Annayya ga💥💥 Andhari hrudhayalanu Geluchukunna Gokul🥹🥹
Watch #JagadhatriIntaMitraLakshmilaKalayika on This Sunday at 7 PM on #ZeeTelugu#ZeeTeluguPromo pic.twitter.com/SdEdObgtyc
— ZEE TELUGU (@ZeeTVTelugu) March 27, 2024
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా.. ఆ పండక్కి..