×
Ad

Janhvi Kapoor: నా తల్లి మరణాన్ని ఎగతాళి చేశారు.. మాట్లాడాలంటే భయమేసింది.. అది మహా పాపం

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తన తల్లి మరణాన్ని కూడా ఎగతాళి చేస్తూ వార్తలు ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Janhvi Kapoor makes shocking comments on the current media

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తన తల్లి మరణాన్ని కూడా ఎగతాళి చేస్తూ వార్తలు ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రీసెంట్ గా జాన్వీ(Janhvi Kapoor) ఒక టాక్ షోలో పాల్గొంది. ఆ షోలో ఆమె సోషల్ మీడియా, మీడియా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. “నా తల్లి చనిపోయిన తరువాత ఆ విషయం గురించి మాట్లాడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే, నా తల్లి మరణాన్ని నా ఎదుగుదలకు వాడుకుంటున్నాని వార్తలు రాస్తారేమో అని. అందుకే, నాలో నేనే చాలా మధన పడ్డాను. ఆ సమయంలో నేను పడిన వేదన మాటల్లో చెప్పలేను.

Mrunal Thakur: ఆకుపచ్చ చీరలో అందాల రాశిలా.. మిలమిలా మెరిసిపోతున్న మృణాల్.. ఫొటోలు

ఈ మీడియా, జర్నలిజం, సోషల్ మీడియా మానవ నైతికత‌ను దెబ్బతీస్తున్నాయి. చనిపోయిన వారిపై కూడా మీమ్స్‌ వేస్తున్నారు. ఈ పరిస్థితి చాలా భయంకరమైనది. నటులు ధర్మేంద్ర చనిపోయినప్పుడు కూడా అలాంటి వార్తలే రాశారు. అది చాలా పాపం. రోజు రోజుకు పరిస్థితి ఇంకా ఇంకా దిగజారిపోతోంది”అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది. దీంతో ఆమెకు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ లో పెద్ది సినిమా చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు.

పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అచ్చియ్యమ్మ అనే పాత్రలో కనిపించనుంది జాన్వీ. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన చికిరి అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్ లో తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది జాన్వీ. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కకంపోజ్ చేసిన ఈ పాట కూడా ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక ఈ సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.