చేపల మధ్య చందమామ.. హనీమూన్ పిక్స్ వైరల్!

  • Publish Date - November 12, 2020 / 12:56 PM IST

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వివాహం గౌతమ్ కిచ్లుతో అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలకు పరవశిస్తూ ఫొటోలకు పోజులిస్తూ అభిమానులకు అప్డేట్ ఇస్తుంది కాజల్..


పెళ్లి తర్వాత భర్తతో కలిసి కొత్త ప్రపంచాన్ని సరికొత్తగా ఎంజాయ్ చేస్తున్నానంటూ మాల్దీవ్స్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. కాజల్ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


కాగా పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పిన కాజల్ చేతిలో.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, విశ్వనాయకుడు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’ సినిమాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు