Thimmarajupalli tv OTT: ఓటీటీలోకి రూరల్ కామెడీ డ్రామా.. ‘తిమ్మరాజుపల్లి TV’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యంగ్ హీరో కిరణ్ సబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ(Thimmarajupalli tv OTT)’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతోంది.
- V Santhosh Kumar
- Published on- May 7, 2026 / 04:43 PM IST
thimmarajupalli tv movie ready to streaming on aha
- కిరణ్ అబ్బవరం నిర్మించిన పల్లెటూరి కథ.
- బాల్యపు జ్ఞాపకాలతో తిమ్మరాజుపల్లి టీవీ
- మే 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్.
Thimmarajupalli tv OTT: టాలీవుడ్ యంగ్ హీరో హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేసిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ(Thimmarajupalli tv OTT)’. సాయితేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలలోకి తీసుకువెళ్లి, మంచి ప్రశంసలను అందుకుంది.
Janhvi Kapoor: స్టైలిష్ లుక్తో ఆకట్టుకున్న జాన్వీ కపూర్.. క్రేజీ ఫొటోలు వైరల్
ఇప్పుడు ఈ హృద్యమైన కావ్యం డిజిటల్ ప్లాట్ఫామ్పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ వేదికగా మే 15వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆహా యాజమాన్యం అధికారికంగా ఒక పోస్టర్ను విడుదల చేస్తూ ప్రేక్షకులకు ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉన్న ఈ కథ, ఓటీటీలోనూ మంచి స్పందన పొందుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
దర్శకుడు వి.మునిరాజ్ సరికొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని ఎంతో సహజంగా తెరకెక్కించారు. మారుమూల గ్రామంలోని పరిస్థితులు, అక్కడి ప్రజల భావోద్వేగాలను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. కిరణ్ అబ్బవరం తన సొంత నిర్మాణంలో ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నం చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి వినోదాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.
