Manchu Manoj : నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధం.. మంచు మనోజ్ సంచలన పోస్ట్!

ఇటీవల మంచు బ్రదర్స్ విష్ణుకి (Manchu Vishnu) అండ్ మనోజ్ (Manchu Manoj) గొడవకి సంబంధిన ఒక వీడియో పోస్ట్ టాలీవుడ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్ మరో సంచలన పోస్ట్ లు చేశాడు.

Manchu Manoj : గత కొన్నిరోజులుగా మంచు బ్రదర్స్ విష్ణుకి (Manchu Vishnu) అండ్ మనోజ్ (Manchu Manoj) మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన మనోజ్ పెళ్లికి విష్ణు రాకపోవడం, మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో కూడా వీరిద్దరూ మాట్లాడుకోకపోవడం వంటి సంఘటనలు ఆ వార్తలు నిజమనేలా చేశాయి. ఇక ఈ శుక్రవారం (మార్చి 24) మనోజ్ అండ్ విష్ణు గొడవ పడుతున్న వీడియో ఒకటి బయటకి, దానిని స్వయంగా మనోజ్ షేర్ చేయడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Manchu Vishnu Vs Manoj : మా అబ్బాయిల మధ్య ఎలాంటి గొడవలు లేవు.. మోహన్ బాబు భార్య!

కొంత కాలంగా మనోజ్ అనుచరుల పై విష్ణు ఏదో విధంగా గొడవకి దిగుతున్నట్లు, ఈ క్రమంలోనే ఇటీవల తన అనుచరుడు సారథి ఇంటికి విష్ణు వచ్చి దాడికి పాల్పడినట్లు మనోజ్ ఒక వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ అవుతుండడంతో మోహన్ బాబు (Mohan Babu) ఎంట్రీ ఇచ్చి ఇద్దరికీ నచ్చచెప్పి ఆ వీడియోని డిలీట్ చేయించాడు. తాజాగా మనోజ్ మరో సంచలనం పోస్ట్ వేశాడు. ”కళ్ళ ముందు జరుగుతుంది తప్పు అని తెలిసి కూడా ఏమి జరగనట్లు ఉండడం కంటే, నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధం” అంటూ వెల్లడించాడు.

Manchu Vishnu Vs Manoj : అన్నదమ్ముల గొడవ పై స్పందించిన మోహన్ బాబు.. నాకేం తెలియదంటున్న మంచు లక్ష్మి!

ఈ పోస్ట్ తో పాటు మరో పోస్ట్ కూడా వేశాడు. ”క్రియేటివిటీకి నెగిటివిటీనే శత్రువు” అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. కాగా వీరిద్దరి మధ్య విబేధాలు రావడానికి గల కారణాలు ఏంటనేది తెలియలేదు. ఇక ఈ విషయం పై మంచు లక్ష్మిని (Manchu Lakshmi) ప్రశ్నించగా.. నాకు అసలు ఈ గొడవ గురించే తెలియదు. దాని గురించి తెలియకుండా నేను మాట్లాడను అంటూ బదులిచ్చింది. మోహన్ బాబు భార్య స్పందిస్తూ.. “మా అబ్బాయిల మధ్య ఎలాంటి గొడవలు లేవు” అంటూ చెప్పుకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు