Navatihi Utsavam : ప్రస్తుతం తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో అదరగొడుతుంది. గతంలో 75 ఏళ్ళ తెలుగు సినిమా అంటూ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో తెలుగు సినీ పరిశ్రమ అంతా పాల్గొంది. ఇప్పుడు మరోసారి అలాంటి భారీ ఈవెంట్ ని చేయబోతున్నారు. టాలీవుడ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగనుంది.
గత కొన్ని రోజులుగా మంచు విష్ణు దీనిపై పనిచేస్తున్నారు. ఇటీవలే ఓ ప్రెస్ మీట్ పెట్టి 90 ఏళ్ళ వేడుకని నవతిహి ఉత్సవం పేరుతో ఘనంగా మలేషియాలో చేయబోతున్నామని ప్రకటించారు. తాజాగా మలేషియాలో దేనికి సంబంధించిన పనులు పూర్తిచేసి అక్కడ ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు మంచు విష్ణు.
Also Read : Sukumar – Allu Arjun : సుకుమార్తో బన్నీ మొత్తం 7 సినిమాలు చేయాలా? అప్పుడు ఇచ్చిన మాట..
మలేషియా కౌలాలంపూర్లో ఉన్న బుకిట్ జలీల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టేడియంలో జూలై 20, 2024న ఈ నవతిహి ఉత్సవం వేడుకని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం గురించి చెప్పడానికి, ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న వారితో కలిసి మంచు విష్ణు మలేషియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు.
Movie Artist Association President @iVishnuManchu proudly unveils the captivating logo of #MAA Navatihi Utsavam from Kuala Lumpur, Malaysia! 🎉
The celebration of 90 glorious years of Telugu cinema, commemorating its rich history, ground-breaking achievements, and enduring… pic.twitter.com/8PLZLcEmyr
— Sai Satish (@PROSaiSatish) May 7, 2024
తెలుగు సినీ పరిశ్రమ మలేషియాలో ఘనంగా నిర్వహిస్తున్న ఈ నవతిహి ఉత్సవంకు మలేహియా టూరిజం సపోర్ట్ చేస్తుండటం గమనార్హం. మలేషియా టూరిజం, మా (MAA), స్థానిక ఈవెంట్ ఆర్గనైజర్ MC ఎంటర్టైన్మెంట్తో ఈ గ్లోబల్ వేడుకను జులై 20న చేయబోతున్నారు. అలాగే ఈ నవతిహి ఉత్సవం కేవలం సినిమా ఈవెంట్ లానే కాకుండా మలేషియా, తెలుగు ప్రజల మధ్య అవగాహన, గౌరవాన్ని పెంచే సాంస్కృతిక కార్యక్రమంలా కూడా ఉండనుందని తెలిపారు.