చిరు సందేశం: చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్క్ ధరించండి..

  • Publish Date - July 16, 2020 / 12:18 PM IST

‘చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్క్‌ ధరించడం ఎంతో అవసరం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.

కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి ఓ వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవితో పాటు యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బ నటించింది.

‘మాస్క్‌ను తప్పనిసరిగా ధరించండి.. వీలైనన్నిసార్లు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోండి.. సాంఘిక దూరాన్ని పాటించండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. అలాగే మీ కుటుంబాన్ని ఈ దేశాన్ని కూడా కాపాడండి’.. అంటూ చిరు పిలుపునిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు