Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమై పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Veera Simha Reddy : అభిమానుల ‘మనోభావాల్ని’ ఉత్సహపరుస్తున్న బాలయ్య.. సాంగ్ ప్రోమో రిలీజ్!
కాగా, ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ ఇప్పటికే ముగియగా, రీసెంట్గా ఈ సినిమాలో బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల షూటింగ్ను జరుపుకుంది చిత్ర యూనిట్. ఇక ఈ రెండు పాటల షూటింగ్ కూడా పూర్తి కావడంతో వీరసింహారెడ్డి చిత్ర షూటింగ్కు గుమ్మడికాయ కొట్టారు బాలయ్య అండ్ టీమ్. ఈ సినిమాను పవర్ఫుల్ ఫ్యాక్షన్ కథ నేపథ్యంలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.
Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’లో ఇది మామూలు ట్విస్టు కాదుగా..?
సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక రీసెంట్గా ఈ సినిమా నుండి ‘‘మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి..’’ అనే పాటకు యూట్యూబల్లో సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.