Veera Simha Reddy : అభిమానుల ‘మనోభావాల్ని’ ఉత్సహపరుస్తున్న బాలయ్య.. సాంగ్ ప్రోమో రిలీజ్!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'జై బాలయ్య', 'సుగుణ సుందరి' అంటూ రెండు పాటలు విడుదల కాగా చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇక మూడో సాంగ్ గా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ క్రమంలోనే..

Veera Simha Reddy : అభిమానుల ‘మనోభావాల్ని’ ఉత్సహపరుస్తున్న బాలయ్య.. సాంగ్ ప్రోమో రిలీజ్!

Veera Simha Reddy third single promo out

Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. బాలయ్యకి జంటగా శృతిహాసన్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘జై బాలయ్య’, ‘సుగుణ సుందరి’ అంటూ రెండు పాటలు విడుదల కాగా చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

Pawan Kalyan: వీరసింహారెడ్డి అడ్డాలో వీరమల్లు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

ఇక మూడో సాంగ్ గా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ క్రమంలోనే నిన్న రాత్రి సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. “మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే” అంటూ ఈ సాంగ్ మాస్ ని ఊరుతులూగించేలా ఉంది. ఈరోజు(శనివార) మధ్యాహ్నం గం.03:19 నిమిషాలకు ఫుల్ లిరికల్ సాంగ్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.

ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ సమకూరుస్తున్నాడు. శేఖర్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేస్తున్నాడు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ సాంగ్ మోత మోగిపోతుంది అంటున్నారు దర్శకనిర్మాతలు. మరి ఫుల్ లిరికల్ సాంగ్ కోసం మధ్యాహ్నం వరకు వెయిట్ చేయండి. కాగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. దీంతో బ్యాలన్స్ ఉన్న సాంగ్స్ షూట్ ని శరవేగంగా ముందుకు తీసుకు వెళుతున్నాడు దర్శకుడు మలినేని.