Nayanthara Vignesh Shivan : మలేషియాలో పిల్లల ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన నయనతార.. స్పెషల్ ఫోటోలు.. ఎంత క్యూట్‌గా ఉన్నారో

ఉయర్, ఉలగ్ పుట్టి నిన్నటికి సంవత్సరం అవుతుండటంతో వీరి మొదటి పుట్టిన రోజు వేడుకల్ని మలేషియాలో(Malaysia) నిర్వహించారు నయన్ - విగ్నేష్.

Nayanthara Vignesh Shivan Celebrated their Children First Birthday in Malaysia Photos shared

Nayanthara Vignesh Shivan Children’s : నయనతార – డైరెక్టర్ విగ్నేష్ శివన్ దంపతులు సంవత్సరం క్రితం సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలు కన్నట్టు ప్రకటించారు. వారికి ఉయర్ రుద్రో నీల్, ఉలగ్ దైవిక్ అనే పేర్లు పెట్టారు నయన్ దంపతులు. అప్పట్నుంచి ప్రతి పండక్కి వాళ్ళ ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళ ఫేసెస్ పూర్తిగా చూపించకుండానే ఫోటోలు పెట్టారు. మొదటి సారి నయన్ దంపతులు తమ కవల పిల్లల ఫోటోలు ముఖాలు చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఉయర్, ఉలగ్ పుట్టి నిన్నటికి సంవత్సరం అవుతుండటంతో వీరి మొదటి పుట్టిన రోజు వేడుకల్ని మలేషియాలో(Malaysia) నిర్వహించారు నయన్ – విగ్నేష్. పిల్లలతో కలిసి మలేషియాలో ఎంజాయ్ చేశారు. పిల్లల్ని ఎత్తుకున్న ఫోటోలు, మలేషియా కౌలాలంపూర్ ట్విన్ టవర్స్ వద్ద ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

Also Read : Guntur Kaaram Update : మహేష్ బాబు గుంటూరు కారం అప్డేట్.. పండక్కే ఫస్ట్ సాంగ్..

నయనతార-విగ్నేష్ శివన్ తమ పిల్లలతో ఉన్న ఫోటోలు షేర్ చేసి.. మా బంగారు కొండలు ఉయర్, ఉలాగ్ పుట్టి సంవత్సరం అయిపోయింది. మీరు మా జీవితంలోకి వచ్చి మా జీవితాన్ని ఎంతో ఆనందంగా, రంగులమయంగా వెలుగులతో నింపేశారు. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ మొదటి పుట్టిన రోజుని ఇక్కడే ఇంత పెద్ద టవర్స్ దగ్గర సెలబ్రేట్ చేయాలనుకున్నాను. అది జరిగినందుకు దేవుడికి ధన్యవాదాలు. అమ్మ నాన్న మిమ్మల్ని ఎంతగానో లవ్ చేస్తున్నారు అంటూ ఎమోషనల్ పోస్టులు పెట్టారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక అభిమానులు, పలువురు ప్రముఖులు నయన్ విగ్నేష్ దంపతుల పిల్లలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు