Harikrishna
Harikrishna Jayanthi: నటుడిగా, చైతన్య రథసారథిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గొప్పవ్యక్తి.. టైగర్, సాహసరత్న నందమూరి హరికృష్ణ. ఆగస్ట్ 29, 2018న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అకాల మరణం చెందారు.
సెప్టెంబర్ 2న హరికృష్ణ 65వ జయంతి సందర్భంగా నారా – నందమూరి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, నారా చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్, నారా రోహిత్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు హరికృష్ణను స్మరించుకున్నారు.
నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నాను. అందరికీ ఆత్మీయుడిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన హరికృష్ణ జ్ఞాపకాలను, పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవను ఈ సందర్భంగా స్మరించుకుందాం. pic.twitter.com/BJRLpvtqrH
— N Chandrababu Naidu (@ncbn) September 2, 2021
తండ్రి స్మృతులను గుర్తు చేసుకుంటూ.. ‘‘ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’’ అంటూ తనయులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ భావోద్వేగభరితమైన ట్వీట్స్ చేశారు.
మీ 65వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ…Miss You Nanna! pic.twitter.com/MJwwAz7wLk
— Jr NTR (@tarak9999) September 2, 2021
కొందరు మన మధ్య లేకపోయినా వారితో మనకు ఉన్న అనుబంధం వారిని సజీవంగా మన కళ్ళ ముందు ఉంచుతుంది. నా విషయంలో హరి మావయ్య కూడా అంతే. ఆయన జయంతి సందర్భంగా హరి మావయ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను pic.twitter.com/vv3y3BkQ9I
— Lokesh Nara (@naralokesh) September 2, 2021
మీ జయంతి సందర్బంగా మిమ్మల్ని స్మరించుకుంటున్నాము.మీ నిష్కల్మషమైన చిరునవ్వు మాతో పదిలంగా ఉంటుంది హరిమామా !! pic.twitter.com/8ayVDPnFoi
— Rohith Nara (@IamRohithNara) September 2, 2021