Pranaya Godari Movie Song Released by Shekar Master
Pranaya Godari : పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో PL విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రణయగోదారి’. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటించగా సాయి కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. గోదావరి ఒడ్డున ఓ ప్రేమకథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఈ సినిమా.
ఇప్పటికే ప్రణయ గోదారి సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ‘తెల్లారుపొద్దుల్లో..’ అంటూ సాగే ఈ మెలోడియస్ రొమాంటిక్ పాటను కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటని మార్కండేయ రాయగా ఆయన సంగీత దర్శకత్వంలోనే ధనుంజయ్, అదితి భావరాజు పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
ఇక పాట రిలీజ్ చేసిన అనంతరం శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ప్రణయగోదారిలోని పాటను చూశాను. మా మోహన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అరకులో అందంగా ఈ పాటను షూట్ చేశారు అని అన్నారు.