ముంబైలో ఓటు వేసిన బాలీవుడ్ సెలబ్రిటీస్

2019 లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 4వ దశలో మహారాష్ట్రలోని ముంబైలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులంతా స్వయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటేసేందుకు వచ్చిన సెలబ్రిటీలతో కలర్‌ఫుల్‌గా మారింది. 

ఓటేసి..మీడియా ముందు తమ చేతి వేలిని చూపిస్తూ తమ దేశభక్తిని తెలుపుతున్నారు. ప్రియాంక చోప్రా అయితే ప్రత్యేకించి ఓటు వేసేందుకే ముంబైకి వచ్చారు. ఆమెతో పాటు అమీర్ ఖాన్, పరేశ్ రావల్, బీజేపీ ఎంపీ అభ్యర్థి రవి కిషన్‌, అజయ్ దేవగన్, కాజోల్, హీరో మాదవన్, టైగర్ ష్రాఫ్, మాదురీ దీక్షిత్, ఊర్మిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

17 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ముంబై నార్త్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై సౌత్ ప్రాంతాలలోనూ ఇదే సమయానికి పోలింగ్ నిర్వహించనున్నారు. 

ట్రెండింగ్ వార్తలు