Rajinikanth : రజినీకాంత్ పంచ్ డైలాగ్.. వైసీపీ నాయకులకేనా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

తాజాగా రజినీకాంత్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ఇటీవల రజినీకాంత్ జైలర్(Jailer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో రజినీకాంత్ స్పీచ్ అంతా మాట్లాడాక చివర్లో..

Rajinikanth counter to YCP Leaders in Jailer Audio Launch Event goes Viral

Rajinikanth : కొన్ని రోజుల క్రితం రజినీకాంత్ ఎన్టీఆర్(NTR) శతదినోత్సవాల ఈవెంట్ కి విజయవాడకు వచ్చి ఎన్టీఆర్ ను, చంద్రబాబు(Chandrababu)ని పొగిడారు. అది ఒక ప్రైవేట్ ఈవెంట్ అయినా, రజిని ఎన్టీఆర్ ని పొగిడినా, రజిని అసలు ఏపీ పాలిటిక్స్(AP Politics) గురించి, వైసీపీ(YCP) నాయకుల గురించి మాట్లాడకపోయినా వైసీపీ నాయకులంతా రజినీకాంత్ మీద ఫైర్ అయ్యారు. చంద్రబాబుని పొగిడినందుకు వైసీపీ నాయకులంతా కట్ట కట్టుకొని సూపర్ స్టార్ రజినీకాంత్ ని విమర్శించారు.

దీంతో వైసీపీ నాయకులు రజినీకి సారి చెప్పాలని సోషల్ మీడియాలో పెద్ద హంగామా జరిగింది. రజినీకాంత్ ఫ్యాన్స్ అంతా వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు రజినికి ఫోన్ చేసి మాట్లాడితే.. అలాంటివి వస్తూ ఉంటాయి నేను పట్టించుకోను అని చెప్పినట్లు తెలిపారు. తాజాగా రజినీకాంత్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

Mahesh Babu : మహేష్ బర్త్‌డేకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్.. ఏకంగా నక్షత్రాన్నే కొనేసి..

ఇటీవల రజినీకాంత్ జైలర్(Jailer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో రజినీకాంత్ స్పీచ్ అంతా మాట్లాడాక చివర్లో.. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు జరగని ఊరు లేదు.. మనం మన పని చేసుకుంటూ పోతానే ఉండాలి అని చెప్పి లాస్ట్ లో తెలుగులో అర్ధం అయ్యిందా రాజా.. అని అన్నారు. మొత్తం తమిళ్ లో చెప్పి చివర్లో మాత్రం తెలుగులో అర్థమైందా రాజా అని చెప్పడంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది. దీంతో ఇది వైసీపీ నాయకులకు కౌంటర్ అని రజిని ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా కొడాలి నాని రజినీపై చేయరాని విమర్శలు చేయడంతో ఈ కౌంటర్ అతనికే అని, వైసీపీ నాయకులకే అని అందరూ కామెంట్స్ చేస్తూ ఈ వీడియోలు షేర్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు