Rana Daggubati playing Lord Rama role in Jai Hanuman movie.
Jai Hanuman; ప్రశాంత్ వర్మ.. తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టడంలో ఈ డైరెక్టర్ దిట్ట. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అలాంటివే. ఆ నుంచి మొన్న వచ్చిన హనుమాన్ వరకు అన్నీ లో బడ్జెట్ లో వచ్చి బ్లాక్ బస్టర్స్ అయినవే. ఇప్పుడు ఈ దర్శకుడు చేస్తున్న లేటెస్ట్ మూవీ జై హనుమాన్. బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఇక అప్పటినుంచి జై హనుమాన్ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ, ఆ సినిమా మాత్రం రావడం లేదు. కనీసం షూటింగ్ కూడా ఇంకా మొదలవలేదు. దానికి కారణం రిషబ్ శెట్టి వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటమే.
Siddu Jonnalagadda: ఓటీటీలో అడుగుపెడుతున్న సిద్దు.. సూపర్ హిట్ డైరెక్టర్ తో క్రేజీ ప్రాజెక్ట్
ఇటీవల ఆయన ఫ్రీ అవడంతో జై హనుమాన్(Jai Hanuman) పై ఫోకస్ పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, జై హనుమాన్ సినిమా కోసం భారీగా బడ్జెట్ పెరుగనుందట. దానికి కారణం జై హనుమాన్ కోసం అందరు స్టార్స్ నే తీసుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే హనుమంతుడి పాత్ర కోసం రిషబ్ శెట్టిని తీసుకోగా, శ్రీరాముడి పాట కోసం రానా తీసుకున్నాడట.
దీనికి సంబంధించి రీసెంట్ గా ఫోటో షూట్ కూడా జరిగిందని టాక్. ఇక మ్యూజిక్ కోసం ఎంఎం కీరవాణిని ఫిక్స్ చేశాడట ప్రశాంత్. ఇంకా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో ఉండబోతున్నారట. అలా జై హనుమాన్ సినిమాను స్టార్స్ తో ఫీల్ చేయబోతున్నాడట. అయితే, హనుమాన్ సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లో చేసి సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కోసం మాత్రం భారీగా ఖర్చు చేయిస్తున్నాడు. మరి ఆ లెక్కలను ప్రశాంత్ మోయగలడా. ఆ రేంజ్ హిట్ ను అందించగలడా అనేది అనుమానంగా మారింది. ఇక జై హనుమాన్ సినిమా 2027లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.