Rashmi Gautam: మానవ జాతి తుడుచుపెట్టుకుపోయే సమయం ఆసన్నమైందేమో అనిపిస్తుంది.. ఔను.. ఈ భూమ్మీద మనకి ఇంకా బ్రతికే అర్హత లేదని యాంకర్, నటి రష్మీ గౌతమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రష్మీ అంటే హాట్ యాంకర్ మాత్రమే కాదు.. మానవతావాది కూడా. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు కానీ రష్మీ కష్టాల్లో ఉన్న మనుషులను ఆదుకోవడమే కాదు.. మూగజీవాల ఆకలి తీర్చే ప్రేమికురాలు కూడా.
Naga Chaitanya-Samantha: భరించలేని బాధ.. ఆ నొప్పేంటో తనకు తెలుసన్న ప్రకాష్ రాజ్!
కరోనా లాక్ డౌన్ సమయంలో మనుషులే కానరాక తిండి దొరకని వీధి కుక్కలకు ఆహారాన్ని అందించి పెద్ద మనసు చాటుకుంది రష్మీ. మనుషులకు ఆకలేస్తే నోరు తెరిచి అడుగుతారు. కానీ.. మూగ జీవాలు అడగలేవు కదా అంటూ కరోనా సమయంలో ఆమె ఎన్నో వీధి కుక్కల ఆకలి తీర్చగా.. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకుంది. అయితే తాజాగా ఓ నెటిజన్ పంచుకున్న ఓ వీడియో చూసి ఆమె కలత చెంది ఎమోషనల్ గా రియాక్ట్ అయింది.
Naga Chaitanya-Samantha: సోషల్ మీడియా సాక్షిగా చై.. సామ్.. సిద్దార్థ్.. జుకల్కర్!
ఓ వీధి కుక్కను కొందరు వ్యక్తులు వెంబడించి కర్రలతో చావబాదారు. ఆ వ్యక్తులు ఆ కుక్కను కర్రలతో కొడుతుంటే బాధతో విలవిలాడిపోయింది. కానీ.. వదలని వాళ్ళు కొట్టి చంపారు. మధ్యప్రదేశ్ లోని దివాస్ లో ఈ అమానుష ఘటన జరగగా.. ఆ ఇద్దరు వ్యక్తులు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఉద్యోగులుగా తెలుస్తుంది. సెంథిల్ కుమార్ అనే నెటిజన్ ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేయగా రష్మీని ట్యాగ్ చేశాడు. ఈ వీడియో చూసిన రష్మీ ఎమోషనల్ గా స్పందిస్తూ మనకి ఇక్కడ బ్రతికే అర్హతే లేదని కామెంట్ చేసింది.
Trigger warning-sensitive content
This video has been shot by one from Dewas,MP
Two of the employees of Municipal corporation of Dewas tied a dog in a net and killed him by beating with a stick continuously for more than 30 minutes@rashmigautam27 @TheJohnAbraham @asharmeet02 pic.twitter.com/NPzDAfyDpq
— Senthil kumar (@SENTHILSSK1982) October 3, 2021