ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..
ముంబై : మహా శివరాత్రి పర్వదినం నాడు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి తన అభిమానులకు శుభవార్త చెప్పింది. తమకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు తెలిపిందామె. ‘‘ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జూనియర్ ఎస్ఎస్కే (Samisha Shetty Kundra) వచ్చేసింది.
చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. సమీశా శెట్టి కుంద్రా.. ఫిబ్రవరి 15న జన్మించింది. ‘స’ అంటే సంస్కృతంలో ‘కలిగి ఉండటం’ అని అర్థం. ‘మిశ’ అంటే రష్యన్ భాషలో దేవత. మా ఇంటి మహా లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్కు మీ ఆశీర్వాదాలు కావాలి. తల్లిదండ్రులు : రాజ్- శిల్పాశెట్టి కుంద్రా. అన్నయ్య వియాన్’’ అంటూ పాప చేతితో తన వేలిని పట్టుకున్న పిక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
శిల్పాశెట్టి.. వ్యాపారవేత్త రాజ్కుంద్రాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు వియాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న సరోగసీ ద్వారా వీరికి ఆడబిడ్డ జన్మించినట్లు తెలుస్తోంది. ఇక పదమూడేళ్లుగా వెండితెరకు దూరమైన శిల్పాశెట్టి.. యోగాసనాల వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ‘నికమ్మ’ టైటిల్తో షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో త్వరలోనే బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతుంది శిల్పాశెట్టి.