Shivani Rajasekhar : సీనియర్ హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఇటీవల మిస్ ఇండియా పోటీలలో పాల్గొనబోతున్నాను అనే సంగతి సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. అయితే శివాని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ పోటీలకు ఎంపికైంది. ఇక ఈ పోటీలో పాల్గొన్న శివాని ఇప్పుడు మిస్ తమిళనాడుగా రిప్రజెంట్ చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఫెమినా మిస్ ఇండియా టీం తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 2022 లో జరగనున్న ఈ మిస్ ఇండియా పోటీలలో పాల్గొనే ఫైనల్ లిస్ట్ ని విడుదల చేయగా అందులో శివానిని మిస్ తమిళనాడుగా చూపించింది. దీంతో తెలుగు అమ్మాయి అయి ఉండి తమిళనాడుకు రిప్రజెంట్ చేయడమేంటని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
Suma: ‘జయమ్మ పంచాయితీ’ ప్రీరిలీజ్ బిజినెస్.. ఎంతో తెలుసా?
తాజాగా తన తండ్రి రాజశేఖర్ నటించిన ‘శేఖర్’ మూవీ ట్రైలర్ విడుదల ఈవెంట్లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది శివాని. ఈ ఈవెంట్లో శివాని మాట్లాడుతూ.. ”తెలంగాణలో ఉంటున్న నేను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలనుకున్నాను. కానీ ఫెమినా మిస్ ఇండియా నిర్వాహకులు అప్లికేషన్లో మల్టిపుల్ అప్షన్స్ ఇచ్చారు. దాంట్లో మనం కచ్చితంగా మూడు రాష్ట్రాలని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. నేను తెలంగాణ, ఆంధ్రాతో పాటు చెన్నైలో పుట్టి పెరిగాను కాబట్టి తమిళనాడును కూడా అప్షన్గా పెట్టాను. దీంతో నిర్వాహకులే నన్ను తమిళనాడు కేటగిరి నుంచి ఎంపిక చేయడంతో మిస్ తమిళనాడుగా ఈ పోటీల్లో పాల్గొనబోతున్నాను. అయితే నేను తెలుగు అమ్మాయిని కాబట్టి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపిక చేస్తే మరింత సంతోషించేదాన్ని. కానీ ఈ పోటీలలో పాల్గొనేవారు అంతా భారతదేశాన్ని రిప్రజెంట్ చేసేవారే” అని తెలిపింది.