Tamil Nadu government announces Kalaimamani Award for Sai Pallavi
Sai Pallavi: మలయాళ నటి సాయి పల్లవికి మరో అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు ప్రభుత్వం ఏటా అందించే (Sai Pallavi)కళైమామణి పురస్కారాలకు ఆమె ఎంపిక అయ్యింది. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను నటి సాయి పల్లవికి ఈ అవార్డు వరించింది. సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం సాయి పల్లవికి ఈ అవార్డును అందించనుంది.
తమిళనాడు ప్రభుత్వం ప్రతీ ఏటా కళైమామణి పురస్కారాలకు అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకు గానూ ఈ పురస్కార విజేతలను ప్రకటించింది. ఇందులో భాగంగానే సాయి పల్లవికి అవార్డు వరించింది. ఇంకా ఈ లిస్టులో.. దర్శకులు ఎస్.జె. సూర్య, లింగుసామి, నటులు మణికందన్, విక్రమ్ ప్రభు లాంటి వారు ఉన్నారు. ఇక సంగీతం, సాహిత్యం, సినిమా, నాటక వంటి రంగాల్లో విశేషమైన సేవలు అందించిన వారిని గౌరవించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏటా ఈ అవార్డులను అందజేస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నత పౌర పురస్కారాలలో ఒకటైన కళైమామణి అవార్డు కింద విజేతలకు మూడు సవర్ల బంగారు పతకం, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.