Diljit Dosanjh : దిల్జిత్ దోసాంజ్ కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు.. స్పందించిన స్టార్ సింగర్

ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన పాటలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు.

Telangana government notices to Diljit Dosanjh star singer responded

Diljit Dosanjh : ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన పాటలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈయన నిర్వహించే మ్యూజిక్ ఈవెంట్స్ చూడడానికి జనాలు ఎగబడతారు. ఇక ఈ స్టార్ సింగర్ “దిల్-లుమినాటి టూర్” లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ ఈవెంట్స్ కోసం జనాలు ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు.

అయితే హైదరాబాద్ లో జరిగే ఈ ఈవెంట్ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులో మద్యం, మాదక ద్రవ్యాలు లేదా హింసను ప్రోత్సహించే ఎలాంటి పాటలను ప్రదర్శించకూడదని దోసాంజ్‌ కు ఈ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఇలా ఆయనకి నోటీసులు పంపడానికి కారణం ఓ చండీఘడ్ వాసి. ఇటీవల న్యూ ఢిల్లీలో కూడా ఈ ఈవెంట్ నిర్వహించగా అందులో డ్రగ్స్, ఆల్కహాల్ ప్రోమోట్ చేస్తునట్టు కొన్ని ఆధారాలతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో తెలంగాణ పోలీసులు ఇకపై డ్రగ్స్, ఆల్కహాల్ ప్రోమోట్ చెయ్యకూడదని దిల్జిత్ దోసాంజ్ కు ఈ నోటీసులు పంపారు.

Also Read :ఏంటి ‘పుష్ప3’లో నటిస్తావా..! తిలక్ వర్మను ఆటపట్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఫన్నీ వీడియో వైరల్

అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు దిల్జిత్ దోసాంజ్.. “తుఫాను ఆగిపోతే మనం తుఫాను అవుతాము, తుఫాను ఆగిపోతే మనం అగ్ని నది అవుతాము” అని పోస్ట్ చేశాడు. తెలంగాణ ప్రభుత్వం తనకి పంపిన నోటీసులను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే దీనికి సంబందించిన పలు ఫోటోలు కూడాషేర్ చేశారు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.