Keedaa Cola : మల్టీప్లెక్స్‌లో రూ.112లకే కీడా కోలా సినిమా.. ఎక్కడెక్కడో తెలుసా..?

మల్టీప్లెక్స్‌లో రూ.112లకే కీడా కోలా సినిమా చూసేలా ఆఫర్ ని తీసుకు వస్తున్నారు మూవీ యూనిట్.

Tharun Bhascker Keedaa Cola new offer in Telangana multiplexes

Keedaa Cola : టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్.. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తరువాత చాలా గ్యాప్ తీసుకోని తెరకెక్కించిన సినిమా ‘కీడా కోలా’. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ తో పాటు తరుణ్ భాస్కర్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. నవంబర్ 3న రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ ముందుకు దూసుకు వెళ్తున్న ఈ మూవీ.. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు చెబుతున్నారు. అయితే మూవీ టీం ఈ కలెక్షన్స్ ని మరింత పెంచేందుకు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. మల్టీప్లెక్స్‌లో రూ.112లకే కీడా కోలా సినిమా చూసేలా ఆఫర్ ని తీసుకు వస్తున్నారు. అయితే ఈ ఆఫర్ కేవలం తెలంగాణలో మాత్రమే. తెలంగాణలో ఉన్న అన్ని మల్టీప్లెక్స్ లో ఇది ఆఫర్ ఉపయోగించుకోవచ్చు. రిక్లైనర్స్ కి మాత్రం ఈ ఆఫర్ వర్తించదు.

Also read : Tiger 3 : తెలుగులో సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ కొత్త తరహా ప్రమోషన్స్.. న్యూస్ పేపర్‌లో రికార్డర్..

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక కూల్ డ్రింక్ చుట్టూ తిరుగుతుంది. కూల్ డ్రింక్ లో వచ్చిన బొద్దింకని చూపించి కంపెనీ పై కేసు వేసి కోట్లు కొల్లగొడదామని ఒక బ్యాచ్, కోట్ల కోసమే తానే బొద్దింకని కూల్ డ్రింక్ వేసిన ఒక నేరస్తుడు.. ఆ కీడా ఉన్న కోలా కోసం జరిగిన సంగ్రామమే సినిమా కథ. ఈ స్టోరీని తరుణ్ భాస్కర్ తనదైన స్టైల్ చూపిస్తూనే నటించి కూడా అలరించాడు. ఇక సినిమాలో బ్రహ్మానందంకి ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా కేవలం హావభావాలతోనే ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు