HanuMan : తేజ సజ్జను సత్కరించిన కిషన్ రెడ్డి.. ‘హనుమాన్’ సక్సెస్‌పై ట్వీట్

హనుమాన్ సినిమా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హీరో తేజ సజ్జను సత్కరించారు.

HanuMan : సంక్రాంతి కానుకగా తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా హీరో తేజ సజ్జ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తేజని సత్కరించడంతో పాటు చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు కిషన్ రెడ్డి.

HanuMan : బాలయ్యకి ‘హనుమాన్’ స్పెషల్ ప్రీమియర్.. సెకండ్ పార్ట్ కోసం..

హనుమాన్ కు దేశ వ్యాప్తంగా జనం బ్రహ్మరథం పడుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా హీరో తేజ సజ్జ కేంద్ర పర్యాటక మంత్రి కిష్ రెడ్డిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి తేజను శాలువాతో సత్కరించారు. సినిమా సూపర్ హిట్ అయినందుకు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసారు.

Chiranjeevi : హనుమాన్ దర్శకుడితో చిరంజీవి సినిమా.. ‘సైరా’ ముందే రావాల్సింది.. కానీ..

‘హనుమాన్ సినిమాలో నటించిన యువ ప్రతిభావంతుడైన నటుడు తేజ సజ్జను ఢిల్లీలో కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా అయోధ్యలోని భవ్య రామ మందిరానికి ప్రతి టిక్కెట్టు నుండి రూ.5 విరాళంగా ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయం’ అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ ద్వారా హనుమాన్ సినిమా టీమ్ ను అభినందించారు. తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాలో  అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. నార్త్ లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది హనుమాన్ మూవీ.

ట్రెండింగ్ వార్తలు