Hanuman
Lord Hanuman: దశాబ్దం క్రితం దొంగిలించబడిన హనుమంతుడి విగ్రహం త్వరలో భారతదేశానికి తిరిగి రానుంది. విజయనగర సామ్రాజ్య కాలంలో 14వ, 15వ శతాబ్దాల మధ్యలో 500ఏళ్లకు ముందు తయారైన హనుమాన్ విగ్రహం తిరిగి తమిళనాడు వెల్లూరు గ్రామంలోని వరదరాజా పెరుమాల్ గుడికి రానుంది. ఈ విగ్రహం తమిళనాడులోని అరియలూరు జిల్లా నుంచి విదేశాలకు అక్రమంగా తరలించబడింది. ఇటీవల ఆస్ట్రేలియాలోని ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి స్వాదీనం చేసుకున్నారు.
ఫిబ్రవరి 22న, ఆస్ట్రేలియన్ ఛార్జ్ డి’అఫైర్స్ మైఖేల్ గోల్డ్మాన్ దానిని కాన్బెర్రాలోని భారత హైకమీషనర్ మన్ప్రీత్ వోహ్రాకు అప్పగించారు. ఈ విగ్రహాన్ని 2012లో దొంగలించగా.. 2014లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వేలం ద్వారా 28 లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తమిళనాడు పోలీసులు ఆస్ట్రేలియా అధికారులను సంప్రదించారు. దీంతో వారు ఆ విగ్రహాన్ని తమిళనాడుకు ఇవ్వబోతున్నారు.
ఈ హనుమాన్ విగ్రహంతో పాటు శ్రీదేవి విగ్రహం, భూదేవి విగ్రహం, అరియలూరు వెల్లూర్ గ్రామంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం నుండి ఏప్రిల్ 9, 2012 న చోరీకి గురయ్యాయి. ఈ కేసు విషయంలో తమిళనాడు పోలీసు ఐడల్ వింగ్కు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సహకరించింది.
500 year old Lord Hanuman bronze idol stolen from Tamil Nadu temple, to be repatriated back to ??
The stolen idol retrieved by US Homeland Security was handed over to @HCICanberra by US CDA
Under the leadership of PM Sh @narendramodi the repatriation of our heritage continues. pic.twitter.com/851HaEkVXG
— G Kishan Reddy (@kishanreddybjp) February 23, 2022