48 మంది పైలెట్లను తొలగించిన Air India

  • Publish Date - August 15, 2020 / 11:27 AM IST

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ Airindia సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రి 48 మంది పైలట్లను తొలగిస్తూ..ఉత్వర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. తొలగించిన వారంతా…ఎయిర్ బస్ 320 పైలట్లు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజీవ బన్సాల్ ను ఇండియన్ పైలట్స్ అసోసియేషన్ (ICPA) కోరింది. ఈ మేరకు లేఖ రాసింది.



పైలట్లకు పర్సనల్ డిపార్ట్ మెంట్ నుంచి లేఖలు వచ్చాయని తెలిపింది. వీరిలో కొంతమంది విధులు నిర్వహిస్తున్నారు. 48 మంది పైలట్లు గత సంవత్సరం ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆరు నెలల నోటీసులు ఇచ్చారు కూడ. ఆ తర్వాత..రాజీనామాను ఉపసంహరించుకున్నారు. వాస్తవానికి రాజీనామ ఉపసంహరణ లేఖలను సంస్థ అంగీకరించిందని, ఇప్పుడు చట్టాన్ని ధిక్కరించిందని, ఇది ఎలా సమర్థనీయమని ప్రశ్నించింది.



ఆర్థికంగా కొన్ని నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా..మరింత కష్టాల్లోకి నెట్టింది. సమీప భవిష్యత్ లో కోలుకుంటామని ఎయిర్ ఇండియా భావించడం లేదని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు