Replacement : భారత ప్రభుత్వానికి చెందిన రాంచీలోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 539అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, ప్లంబర్, కార్పెంటర్, సిర్దార్, అకౌంటెంట్ తదితర విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతి, ఇంటర్మీడియట్తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నవంబరు 20 నాటికి 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. స్టయిపెండ్గా నెలకు రూ.7000 చెల్లిస్తారు
అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబరు 05గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.centralcoalfields.in/